1 August, 2026 | 6:58 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

తెలుగు పండితులకు అన్యాయం

30-11-2024 12:00 AM

తెలంగాణ ప్రభుత్వ నిర్వహించే టెట్ పరీక్షలో తెలుగు, హిందీ, ఉర్దూ పండితుల కోర్సులు పూర్తి చేసిన వారికి అన్యాయం జరుగుతున్నది. సోషల్ వారికి ఉండే కంటెంట్ 60 మార్కులు పండితులకు కూడా పెట్టడం వలన ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. పండిత కోర్సులు  చేసిన వారికి సోషల్ సబ్జెక్టుతో సంబంధం ఉండదు. అయినప్పటికీ వారితో సమానంగా 60 మార్కులకు సోషల్  ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. 

ప్రభుత్వం ఆలోచించి తెలుగు పండిత కోర్సులు పూర్తి చేసిన వారి కోసం పేపర్ థర్డ్ అనేదాన్ని ఏర్పాటుచేసి దానిలో కంటెంట్‌కు 90 మార్కులు కేటాయించాలి. సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు ఉండేటట్లు నిర్వహిస్తే పండిత కోర్సులు చేసిన వారికి న్యాయం చేసినట్లు అవుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి పండిత  కోర్సులు పూర్తి చేసిన వారికి టెట్టు లో న్యాయం చేయగలరని మనవి.

-- తాండ్ర చిరంజీవి, వరంగల్ అర్బన్