19-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 18 (విజయ క్రాంతి): నగరంలోని డంప్ యార్డ్ తరలించేవరకు ఎన్నికల్లో పాల్గొనమని అలకాపురి వాసులు బుధవారం వినూత్న నిరసన తెలిపారు. డంపు యార్డు పొగ వలన శ్వాశ కోశ వ్యాధుల కు గురి అవుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని ఆల్కపూరి కాలనీ కిట్టి మహిళలు రాబోయే ఎలక్షన్స్ లో ఓటు వేయబో ము అని ‘ఓటు లేదు- మాకు ఊపిరి కావాలి అనే స్లోగన్ తో కాలనీ లోని ఇండ్లలో పోస్టర్స్ ని అంటించారు. ఈ కార్యక్రమం లో మునిపల్లి ఫణిత, సరళ, భాగ్య లక్ష్మి, శోభ, శ్యామల, సుమతి, అన్నపూర్ణ, శ్రీలత,పద్మ, లావణ్య, కిట్టి మహిళలు పాల్గొన్నారు.