ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలలో స్థానికతపై హైకోర్టులో మగిసిన విచారణ
29-08-2024 08:02 PM
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలలో స్థానికతపై గురువారం హైకోర్టులో విచారణ ముగిసింది. సీజే ధర్మసనం తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. మెడికల్ సీట్లలో ప్రవేశానికి సంబంధించి గత నెల కొత్త జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివితేనే స్థానికుడిగా పరిగణిస్తూ జీవోను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఇంటర్ చదివినా స్థానికత కోల్పోతున్నారని పిటిషనర్లు వాదించారు. రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరగాలనే స్థానికతపై కొత్త జీవో తెచ్చామన్న ఏజీ తెలిపారు. రేపటిలోగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.






