15 May, 2026 | 6:33 PM

విజయ క్రాంతి వార్తకు స్పందన

15-05-2026 05:19 PM

మొక్క కొనుగోలులో వేగం పెంచాలని ఆదేశం

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న మొక్క కొనుగోలు మొక్కుబడి అనే అంశంపై విజయ క్రాంతిలో ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. మొక్క కొనుగోళ్ల వేగవంతం చేయాలని తూకం చేసిన ధాన్యాన్ని గోదాంకు తరలించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. గోదాములను పరిశీలించారు. సారంగాపూర్ మండలం చించోలి గ్రామం వద్ద పెద్ద ఎత్తున మొక్క జొన్న నిలువ సామర్థ్యాన్ని చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ రాజేందర్ అధికారులు ఉన్నారు.