29-05-2025 12:21:33 AM
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి) : గాంధీ నగర్ డివిజన్ అశోక్ నగర్ లోని స్ట్రీట్ నెం.2 వద్ద జిహెచ్ఎంసీ ఇంజి నీరింగ్ సిబ్బంది నిర్వహిస్తున్న డిసిల్టింగ్ పనులను గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఇంజి నీరింగ్ అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్, బీజేపీ నేతలతో కలిసి పర్యవేక్షించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా నాలా ద్వారా లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరకుండా నాలాలో పేరుకు పోయిన చెత్త చెదారం, మట్టిని తొలగించేందుకు డిసిల్టింగ్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. వర్షాల వల్ల వరద ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పనులు జగలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఆనంద్ రావు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.