29-05-2025 12:23:12 AM
-31న జలవిహార్లో రజతోత్సవ వేడుకలు
ఖైరతాబాద్, మే 28 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం పాత్ర ఎంతో కీలక మైనదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం స్థాపించి 25 వసంతాలు గడుస్తున్న సందర్భంగా 31న నెక్లెస్ రోడ్ని జలవిహార్లో రజతోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీయుడబ్ల్యూజే హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడు నారాయణ మల్లేష్ బాబు అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఫోరం సభ్యులతో కలిసి ఇందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహిం చిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం రజతోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించింది ఆన్నారు.
మాక్ అసెంబ్లీ, ఛలో ఢిల్లీ, సాగర హారం, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలను చేసిన ఘనత జర్నలిస్ట్ ఫోరందని తెలిపారు. ఉద్యమం చల్లబడ్డప్పు అల్లా టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించి ఉద్యమాన్ని ముం దుకు నడిపిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ చేసిన ఉద్యమం మిగతా ఉద్యమాలకు ఒక దిక్సూచి లాంటిదన్నారు. ఈ కార్యక్రమం లో కోశాధికారి పి.యోగానంద్, జా యిం ట్ సెక్రటరి యార నవీన్ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, రాకేష్, రమణ పాల్గొన్నారు.