29-05-2025 12:20:18 AM
- ఎండోమెంట్ శాఖ అధికారులను కలిసిన గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ
కార్వాన్, మే 28 : గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బుధవారం ఉత్సవ కమిటీ చైర్మన్ చంటిబాబు, కార్యనిర్వహణ అధికారి వసంత ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, డిసీ కృష్ణ ప్రసాద్, కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉస్మాన్ బిన్ మహమ్మద్ హజారే తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల ఉత్సవాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ శాఖ అధికారులు ఉత్సవాలకు సంబంధించి పలు సూచనలు చేశారు.
గోల్కొండ కోటలో బోనాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలియజేశారు. ఈ సంవత్సరం బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తమ వంతు సహకరిస్తామని ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ చంటిబాబు తో పాటు ఇతర కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.
తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. బోనాల ఉత్సవాల్లో లక్షలాది మం ది భక్తులు తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులను కూడా గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, సభ్యులు కలిశారు. ఈ కార్యక్రమం లో సభ్యులు నాగులపల్లి శ్రీకాంత్, సంతోష్ గౌడ్, ఆకుల ప్రదీప్ కుమార్, సింగజోగి యాదగిరి, అనిత తదితరులు పాల్గొన్నారు.