calender_icon.png 1 July, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని బోయినిపేట-గంగాపురి బొక్కల వాగు పై హై లెవెల్ బ్రిడ్జి పనులు పరిశీలన

30-06-2025 03:47:30 PM

మంథని,(విజయక్రాంతి): మంథని లో నిర్వహించిన అభివృద్ది పనులకు సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని బోయినిపేట-గంగాపురి వద్ద బోక్కల వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ స్థలం ను స్థానిక నాయకుల తో పాటు కలిసి ఐబి ఈఈ బలరామయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ బ్రిడ్జి  బొక్కల వాగుపై కూచిరాజ్ పల్లి వద్ద ప్రతి పాదించారని, ఆర్.ఆండ్ బి శాఖ ఆధ్వర్యంలో 9.6 కిలోమీటర్ల శ్రీపాద బైపాస్ ఫోర్లేన్ రహదారి రూ. 160 కోట్ల రూపాయలతో చేపడుతున్న కారణంగా, ఈ బ్రిడ్జి నిర్మాణ స్థలం ను  స్థానికుల సూచన మేరకు మార్పు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు  అధికారులను ఆదేశించారని, ఈ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, నిర్మాణం చేయనున్నట్లు ఈఈ బలరామయ్య తెలిపారు.