30-06-2025 03:47:30 PM
మంథని,(విజయక్రాంతి): మంథని లో నిర్వహించిన అభివృద్ది పనులకు సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని బోయినిపేట-గంగాపురి వద్ద బోక్కల వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ స్థలం ను స్థానిక నాయకుల తో పాటు కలిసి ఐబి ఈఈ బలరామయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ బ్రిడ్జి బొక్కల వాగుపై కూచిరాజ్ పల్లి వద్ద ప్రతి పాదించారని, ఆర్.ఆండ్ బి శాఖ ఆధ్వర్యంలో 9.6 కిలోమీటర్ల శ్రీపాద బైపాస్ ఫోర్లేన్ రహదారి రూ. 160 కోట్ల రూపాయలతో చేపడుతున్న కారణంగా, ఈ బ్రిడ్జి నిర్మాణ స్థలం ను స్థానికుల సూచన మేరకు మార్పు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారని, ఈ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, నిర్మాణం చేయనున్నట్లు ఈఈ బలరామయ్య తెలిపారు.