17 April, 2026 | 2:25 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!

17-04-2026 01:18 PM
  1. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి పిలిచి మాజీ ఎంపీటీసీ చేత ప్రారంభం. 
  2. పీఏసీఎస్ అధికారుల అత్యుత్సాహం
  3. అధికారులపై సర్పంచ్ రేణుక ఫిర్యాదు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో గ్రామ మహిళా సర్పంచ్‌ కు ఘోర అవమానం జరిగింది.  గురువారం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రావాలని సీఈవో సిరాజుద్దీన్ ఆహ్వానించి, అనంతరం మాజీ ఎంపీటీసీ దండు నరసింహ చేత ప్రారంభం చేయించడంతో సర్పంచ్‌కు అవమానం జరిగిందని పెద్దకొత్తపల్లి గ్రామ సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాధ్యులైన పీఏసీఎస్ సీఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఇకముందు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్‌లను గౌరవపూర్వకంగా ఆహ్వానించి నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తనను అవమానపరిచిన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు ఆదేశాలు రాకముందే సొంతంగా తామే మార్కెట్ కమిటీ చైర్మన్ లంటూ చెప్పుకొని తిరుగుతూ హంగామా సృష్టిస్తున్న వారికి సహకరించడమేంటని చర్చ జరుగుతుంది.