31-05-2025 12:00:00 AM
చదరపు అడుగుకు ధర రూ.3,730తోనే సకల సౌకర్యాలు
గత ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ల భవనాల కంటే తక్కువ ధరకే నిర్మాణం
కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.4,990 ఖర్చు చేసిన గత ప్రభుత్వం
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): సమాజంలో వెనకబడిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు పూనుకుంది. అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే చోట చదువుకొనేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన సాగించేందుకు వీలుగా బోధనాభ్యసన పరికరాలతో పాటు అత్యా ధునిక మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ర్టంలో ఉన్న 600 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎలాంటి వసతులు కల్పించలేదు.
అవన్నీ దాదాపుగా ప్రైవేటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో వసతులు లేని ప్రైవేటు అద్దె భవనాల నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ భవనా ల్లోకి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను తరలించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అంతర్జాతీ య ప్రమాణాలతో కూడిన క్రీడా వసతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు, ప్రతీ పాఠశాలలో 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నాయి.
గత ప్రభుత్వం కంటే తక్కువ రేట్లతో..
గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు (ఐడీఓసీ) నిర్ణయించిన రేట్లు.. ప్రస్తుత యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్లకు నిర్ణయించిన రేట్లకు వ్యత్యాసముందని ప్రభుత్వం చెబుతోంది. సిద్దిపేట (ఐడీఓసీ)కి చదరపు అడుగుకు రూ. 4,058, సిరిసిల్లకి చదరపు అడుగుకి రూ.4,990, ములుగుకి రూ.3,994, వరంగల్ ఈస్ట్కి రూ.4,875 గత ప్రభుత్వం నిర్ణ యించింది.
అయితే ఈ ప్రభుత్వం అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూ ళ్ల నిర్మాణానికి చదరపు అడుగు కు ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 3,730 మాత్రమే. గత ప్రభుత్వ కాలంలో రెండేళ్ల క్రితం చేపట్టిన ఏనిర్మాణంతో పోల్చుకున్నా ప్రస్తుతం.
ఈ స్కూళ్లకు నిర్ణయించిన ధర చాలా తక్కువని ప్రభుత్వం తెలిపింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ముందు తమ పాలనలో విద్యార్థులకు జరిగిన తీవ్ర అన్యాయా లపై ప్రతిపక్ష పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
విశాలంగా స్కూళ్ల నిర్మాణం
ప్రతీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో అకడమిక్ బ్లాక్ నాలుగు బ్లాక్లుగా జీ+2 ఫ్లోర్లతో 1,60,339 చదరపు అడుగులు, డార్మెటరీ జీ+3 ఫ్లోర్లతో ఆరు బ్లాక్లతో 2,57,451 చదరపు అడుగులు ఉంటుంది. డైనింగ్ కమ్ కిచెన్ జీ+1 ఫ్లోర్లతో 41,860 చదరపు అడుగులు, 3 బీహెకే ప్రిన్సిపల్ క్వార్టర్స్ నాలుగు యూనిట్లు ఒక బ్లాక్ గా జీ+1 ఫ్లోర్లతో 7,483 చదరపు అడుగులు, 2 బీహెచ్కే స్టాఫ్ క్వార్టర్లు 48 యూనిట్లు 1 బ్లాక్గా జీ+3 ఫ్లోర్లతో 61,378 చదరపు అడుగులు, 1 బీహెచ్కే క్వార్టర్లు 8 యూనిట్లు 1 బ్లాక్గా జీ+1 ఫ్లోర్లతో 7,324 చదరపు అడుగులతో మొత్తంగా 5,36,194 చదరపు అడుగుల వైశాల్యంతో, ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం విశాలంగా జరగనుంది.