calender_icon.png 4 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతి అందజేత

04-09-2025 07:45:26 PM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ...

గద్వాల: కులాంతర వివాహం చేసుకున్న జంటకు బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని తమ ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతిని అందజేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ(District Additional Collector Laxminarayana) తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఐజా మండలం ఈడిగొనిపల్లి గ్రామానికి చెందిన ఎస్.మనీషా(వైఫ్ ఆఫ్ ఈ.వీరేంద్ర) ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నందుకు, ప్రభుత్వ కల్పించిన పథకం ద్వారా రూ. 2.50 లక్షల ప్రోత్సాహక బహుమతిని మంజూరైనట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జంటకు బాండ్‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.