23-11-2025 06:38:20 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్వేత శ్రీ 69వ రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్-17 బాలికల విభాగంలో పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం ఆదివారం తెలిపారు. ఇటీవల మెట్పల్లి మండలం వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు, ఈ నెల 23 నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శ్వేతశ్రీ ని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం,శివ, సతీష్,మమత విద్యార్థిని పాల్గొన్నారు.