18 March, 2026 | 7:05 PM

కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించిన ఐపీఎస్ విద్యార్థులు

18-03-2026 05:37 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు  సాధించారు. ఈనెల 16న కరీంనగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు కట విభాగంలో ఏ తరుణ్, వి మనోబిరామ్, జతిన్, ధనుష్ బంగారు పథకాలు సాధించగా కట విభాగంలో మైత్ర వరుణ్, అనీష్, రిత్విక్, రజత, కాంస్యం పథకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కనకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.