18 March, 2026 | 7:23 PM

నేరెళ్లలో ఉగాది సంబరాలు – విద్యార్థులతో కలిసి పచ్చడి సేవించిన సర్పంచ్

18-03-2026 05:39 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉగాది పండుగను ముందస్తుగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించి, షడ్రుచుల ద్వారా మన జీవితం లోని వివిధ అనుభవాలను అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో కలిసి ఉగాది పచ్చడిని సేవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్, గ్రామ కార్యదర్శి సతీష్, ఉపాధ్యాయులు కావ్య, లావణ్య, పావని, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎల్లవ్వ, లక్ష్మి, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంప్రదాయ పండుగలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.