26 May, 2026 | 1:54 AM

ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ

26-05-2026 12:45 AM

లంచం తీసుకుంటుండగా పట్టివేత

హనుమకొండ (మహబూబాబాద్), మే 25 (విజయక్రాంతి): హనుమకొండలో ఏసీబీ అధికారులకు సోమవారం ఇరిగేషన్ శాఖకు చెందిన డీఈ పట్టుబడ్డాడు. జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హనుమకొండ నగరం భవానీ నగర్‌లోని తన ఇంట్లో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

అధికారిక పనుల కోసం లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ పీ.సాంబయ్య తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత సంవత్సరం కాలంగా ఏదో ఒక చోట అవినీతి అధికారులు పట్టుబడుతుండటం సంచలనం సృష్టిస్తున్నది.