23-06-2025 12:47:00 AM
ఏపీ బొందిలి సంఘం గౌరవ అధ్యక్షుడు శంకర్సింగ్
గుంటూరు, జూన్ 22 (విజయ్క్రాంతి): రాజపుత్లుగా జన్మించడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం గౌరవ అధ్యక్షుడు కే శంకర్సింగ్ అన్నారు. ఆదివారం పాత గుంటూరులోని బాలత్రిపుర సుందరి మందిరంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి రాజకీయంగా రాణించాలని పిలుపునిచ్చారు.
బొందిలి కులస్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మనారాయణ సింగ్ మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీలోకి చేర్చాలని కోరారు.
ఏ సామాజిక వర్గమైన ఉన్నత శిఖరాలు చేరాలంటే విద్య తప్పనిసరి అని తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి వచ్చిన రాజపుత్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పవన్ సింగ్, బాలకృష్ణ సింగ్, లోకేశ్వర్ సింగ్, కృష్ణ సింగ్ పాల్గొన్నారు.