11 August, 2026 | 1:25 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఇక ఇజ్రాయెల్ నుంచి

23-06-2025 12:53 AM

ఆపరేషన్ సింధు ద్వారా తరలింపు

న్యూఢిల్లీ, జూన్ 22: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ఠ్యా అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న 1428 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 311 మందితో కూడిన విమానం ఇరాన్‌లోని మష్‌హద్ నుంచి ఆదివారం ఢిల్లీకి చేరుకుంది.

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ముందడుగేసింది. 160 మంది భారతీయులతో కూడిన విమానం ఆదివారం జోర్డాన్ నుంచి బయలుదేరినట్టు ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. 160 మంది భారతీయులు జోర్డాన్ బోర్డర్‌కు చేరుకోగా ఆపరేషన్ సింధు ద్వారా వారిని భారత్‌కు తీసుకొస్తున్నారు.