12-06-2025 12:53:04 AM
- టీపీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 11 (విజయ క్రాంతి) : నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని నూతన ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఓబీసీల సంక్షేమం గురించి మాట్లాడిదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాందీ అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఓబీసీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. కులగణన చేస్తామని షెడ్యూల్ విడుదల చేశారని, కాని 2026లో నార్త్ రాష్ట్రాలు, 2027 మన ప్రాంతంలో చేస్తామనడం సరికా దన్నారు.
ఈడబ్ల్యూఎస్ బిల్లును ఏ విధంగా పార్లమెంట్, రాజ్యసభలో పెట్టి త్వరిగతిన అమలుచేశారో, కులగణనను ఆదే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నా యకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో నా యకులు సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహర్ జహీర్ అఖ్తర్, , షబ్బీర్ అహ్మద్ , సుభాష్ ఖత్రి, అజ్మత్ అలీ, సాయిబాబా, రాములు యాదవ్, ఫయాజ్, మక్సుద్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.