12-06-2025 12:55:01 AM
చౌటుప్పల్, జూన్ 11(విజయక్రాంతి): మన ఆలోచన సాధన సమితి మాస్ వ్యవస్థాపకులు కటక నర్సింగరావు ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీని బుధవారం రోజున ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటీలో మునుగోడు నియోజవర్గం చౌటుప్పల్ మున్సిపల్ తంగడపల్లి గ్రామానికి చెందిన గోద మల్లికార్జున గౌడ్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
అనంతరం గోధ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమైనటువంటి అన్ని రంగాలలో రాజకీయ, ఆర్థిక ,సామాజికంగా వెనుకబడి గ్రామాల్లో ఉన్న బీసీ లను(కులవృత్తులు చేసుకునే) వారిని రాజకీయ పార్టీలకతీతంగా బీసీలను చైతన్య పరచడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంస్థల నియమ నిబంధన లోబడి బీసీల ఐక్యతను నా వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన గడ్డం నరసింహ గౌడ్ ,దొంత ఆనందం, పూస నరసింహ ధన్యవాదాలు తెలిపారు.