18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో అందరం విధిగా ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రత్యేకించి యువత విధిగా ఓటు వేయాలని, దేశానికి మార్గదర్శకులు వారే. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలందరికీ పిలుపు నివ్వడం అభినందనీయం. మొదటిసారి పోలింగ్లో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి ఆయన ఈ సూచన చేస్తూ, వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ మేరకు అవగాహన కలిగించాలన్నారు.
ఆర్.రాజన్న, హుస్నాబాద్