శబ్ద కాలుష్యం వద్దు!

02-05-2024 12:15:00 AM

రోడ్లపై చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ దూసుకుపోయే ద్విచక్ర వాహనదారులు తోటి ప్రజల ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఇటీవలి కాలంలో మాడిఫికేషన్ పేరిట కొందరు బైక్స్ నడిపే యువత సైలెన్సర్స్ మారుస్తూ విపరీతమైన శబ్దం వచ్చేలా కొత్త రకం పరికరాలను బిగించుకుంటున్నట్టు ‘విజయక్రాంతి’లో వచ్చిన వార్త పూర్తి వాస్తవం. ఇటువంటి వారి విషయం లో పోలీసులు, రవాణా శాఖ చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఆర్.వి.రావు, గజ్వేల్