5 May, 2026 | 7:15 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

హైదరాబాద్‌ లో పలుచోట్ల ఐటీ దాడులు

21-01-2025 12:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగర వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం ఐటీ అధికారులు దాడులు(IT Officials Raids) నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామునుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా హైదరాబాద్‌లో 8 చోట్ల ఏకకాలంలో  ఆదాయపు పన్నుశాఖ అధికారులు(Income Tax Department officials) 55 బృందాలు విడిపోయి అనేకచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ, మైత్రి చిత్ర నిర్మాణ సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయం, దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సిత రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు.  పుష్ప-2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.