22 March, 2026 | 5:27 PM

జిట్టాను పరామర్శించిన జగదీశ్ రెడ్డి

27-08-2024 02:25 AM

హైదరాబాద్, ఆగస్టు 26 విజయక్రాంతి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల రోజులుగా యశోద ఆసుపత్రిలో ఆయనకు అందిస్తున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అదే విధంగా జిట్టా కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యంగా ఉండాలని, త్వరలో కోలుకుం టున్నారని భరోసా కల్పించారు. ఆయన వెం ట ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఉన్నారు.