09-06-2025 07:38:03 PM
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ట్రీట్ మెంట్ కోసం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... క్యాన్సర్ ట్రీట్ మెంట్ రూ.లక్షలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందని తెలుసుకున్న జగ్గారెడ్డి మానవత్వంతో రాణిని పరామర్శించిన రూ.4 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.
క్యాన్సర్ అనేది ఎవ్వరికీ రావొద్దని, క్యాన్సర్ బాధితులది టెన్షన్ లతో కూడిన జీవితమన్నారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ రూ.లక్షలతో కూడుకున్న వ్యవహారం కావడంతో నిరుపేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయ్యారు. లక్షలు రూపాయాలు ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం కష్టమని, ఆ పేషంట్ ట్రీట్ మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. తన నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషంట్ కు రూ.10 లక్షలు, ఇవాళ సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషంట్ కు రూ.4 లక్షలు ఆర్థిక సహకారం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్ మెంట్ కోసం సహాయం కావాలని ఎంతోమంది వస్తారని, వారికి తన వంతుగా సహాయం చేస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. కానీ ఎన్నడూ మీడియాలో రాదు.. అది నాకిష్టం ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. స్పెసిఫిక్ గా ఇవాళ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ పేషంట్ లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా అందించడం జరిగిందని స్పష్టం చేశారు.