18 April, 2026 | 12:20 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

గుండ్ల పోచంపల్లిలో జై బాపు.. జై భీమ్ పాదయాత్ర

12-04-2025 12:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్ల పోచంపల్లి  మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన బాధ్య త ప్రతి పౌరుడు మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, ఓబీసీ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్, సురేందర్ ముదిరాజ్, కోమలత, బైరి ఈశ్వర్, బండారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.