29 April, 2026 | 10:45 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు

29-04-2026 09:14 PM

అద్భుత ఫలితాలతో... జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పేదింటి ఆణిముత్యాలు మెరిసారు. ఈ మేరకు బుధవారం వెలువడిన ఫలితాల్లో జవహర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో 159 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 124 మంది ఉత్తీర్ణత సాధించగా 78% నమోదవ్వగా సంకీర్త (548) మనీ సాత్విక( 539) సంఘం సాయిచరణ్ (539) ఆరాధన (537) లాస్య (534) సంజయ్ (534) మార్కులతో రాణించారు.

జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 115 మంది ఉత్తీర్ణత సాధించారు. 86% నమోద మహేష్ (542) భాను ప్రసాద్( 529)  మార్కులతో రాణించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినందుకు బాలాజీ నగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నరసింహ, జవహర్ నగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆజా మోహినిద్దీన్ అభినందనలు తెలిపారు.