24 August, 2026 | 10:16 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

జేఈఈ మెయిన్ ఫైనల్ కీ మళ్లీ విడుదల

19-04-2025 12:00 AM
  1. నేడు ఫలితాలు 
  2. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్-2 తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మళ్లీ విడుదల చేసింది. ముందుగా గురువారం ఫైనల్ కీని విడుదల చేయగా, గంటల వ్యవధిలోనే ఆ కీని తొలగించి తాజాగా మరో కీని విడుదల చేయడం గమనార్హం. తుది కీని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఈమేరకు ఎన్టీఏ ఎక్స్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతేగాక ఫలితాలను ఈ నెల 19 (శనివారం) వరకు ఎప్పుడైనా ప్రకటిస్తామని పేర్కొంది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫైనల్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులను సూచించింది.

తుది కీలో ఫిజిక్స్‌కు సంబంధించి రెండు ప్రశ్నలను తొలగించినట్టు తెలిపింది. గురువారం సాయంత్రం ఫైనల్ కీ విడుదల చేసి, గంటల్లోనే తొలగించడంపై ఎన్టీఏ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఇదిలా ఉంటే పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఈనెల 17 నాటికి ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఫలితాలను ఇవ్వకపోవడంతో ఎన్టీఏ విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్టీఏ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.