జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. టాపర్స్ వీళ్లే
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) శనివారం జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు సాధించిన పర్సంటైజ్ స్కోరుతో ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 24 మంది అభ్యర్థులు పరీక్షలో 100 శాతం స్కోరు సాధించారని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఫలితాల్లో తెలంగాణ నుంచి హర్ష్ ఎ. గుప్తా, అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ, ఏపీ నుంచి సాయి మనోజ్ఞకి 100 పర్సంటైజ్ వచ్చినట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1,2 పరీక్షల్లో ఉత్తమ స్కోరుతో ర్యాంకులు కేటాయించారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ 2025లో తెలంగాణ విద్యార్థులు మరోసారి తమదైన ముద్ర వేశారు, ముగ్గురు పరిపూర్ణంగా 100 పర్సంటైల్ సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) శుక్రవారం రాత్రి ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన వంగల అజయ్ రెడ్డి, బని బ్రతా మజీ, హర్ష్ ఎ గుప్తా 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు.
- ఆయుష్ సింఘాల్ - రాజస్థాన్
- ఆర్కిస్మాన్ నంది - పశ్చిమ బెంగాల్
- దేవదత్తా మాఝీ - పశ్చిమ బెంగాల్
- ఆయుష్ రవి చౌదరి - మహారాష్ట్ర
- లక్ష్య శర్మ - రాజస్థాన్
- కుశాగ్ర గుప్త - కర్ణాటక
- హర్ష్ ఎ గుప్తా - తెలంగాణ
- ఆదిత్ ప్రకాష్ భగడే - గుజరాత్
- దక్ష్ - ఢిల్లీ
- హర్ష్ ఝా - ఢిల్లీ
- రజిత్ గుప్తా - రాజస్థాన్
- శ్రేయాస్ లోహియా - ఉత్తరప్రదేశ్
- సాక్షం జిందాల్ - రాజస్థాన్
- సౌరవ్ - ఉత్తరప్రదేశ్
- వంగాల అజయ్ రెడ్డి - తెలంగాణ
- సానిధ్య సరాఫ్ - మహారాష్ట్ర
- విశాద్ జైన్ - మహారాష్ట్ర
- అర్నవ్ సింగ్ - రాజస్థాన్
- శివన్ వికాస్ తోష్నివాల్ - గుజరాత్
- కుశాగ్రా బైంగహా - ఉత్తరప్రదేశ్
- సాయి మనోజ్ఞ గుత్తికొండ - ఆంధ్రప్రదేశ్
- ఓం ప్రకాష్ బెహెరా - రాజస్థాన్
- బని బ్రత మజీ - తెలంగాణ




