3 July, 2026 | 5:28 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం

19-04-2025 08:12 PM

న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.  ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో జోస్ బట్లర్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రూథర్ ఫోర్డ్(43), సాయి సుదర్శన్(36) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లో ముఖేశ్ కుమార్, కుల్ దీప్ యాదమ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఒడి బ్యాటింగ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర పటేల్(39), అశుతోష్ శర్మ(37), కరుణ్ నాయర్(31), ట్రిస్టన్ స్టబ్స్(31), కేఎల్ రాహుల్(28) పరుగులు తీశారు. గుజరాత్  టైటాన్స్ బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ 4, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ,  సాయి కిశోర్ చెరో వికెట్ తీసుకున్నారు.