18 April, 2026 | 7:29 PM

గుండెపోటుతో విలేకరి మృతి

11-04-2025 01:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మన తెలంగాణ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న రేణిగుంట్ల వెంకటేశ్వర్ శుక్రవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. గత కొద్ది సంవత్సరాలుగా మృతుడు వెంకటేశ్వర్ మండల కేంద్రంలో విలేఖరిగా పనిచేస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.