7 July, 2026 | 12:57 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

జూలై 4 ఫైటింగ్.. 33 మంది మృతి

07-07-2024 01:56 AM

చికాగోలో దారుణ హింస

వాషింగ్టన్, జూలై 6: అమెరికాలోని చికాగోలో ‘జూలై ఫోర్త్’ హింసలో ఈ ఏడాది 33 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చికాగో నగరంలోనే 11 మంది మరణించారు. 55 మంది గాయపడ్డారు. జూలై 4వ తేదీ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా ఏటా ప్రజలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దేశ పశ్చమ భాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఆయుధాల ముఠాల మధ్య తీవ్ర పోరాటాలు జరుగుతాయి. ఈ ఏడాది అవి మరింత భీకరంగా సాగినట్టు పోలీసులు తెలిపారు. జూలై 3న రెండు చోట్ల జరిగిన తుపాకీ పోరాటాల్లో ఇద్దరు మహిళలు, ఒక 8 ఏండ్ల బాలుడు కూడా చనిపోయారు. ఈ దాడులతో నగరంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నదని చికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ తెలిపారు. గత ఏడాది జూలై ఫోర్త్ కాల్పుల్లో 12 మంది మరణించారు. అంతకుముందు సంవత్సరం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.