02-08-2025 12:32:45 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి ,ఆగస్టు 1 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు తగిన న్యాయం చేకూరుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తూర్పు బజారులో నివసిస్తున్న పేదల ఇండ్లను సందర్శించి వారి కష్టాలను తెలుసుకొని, తక్షణమే స్థానిక ఎంపీడీవో కు ఇల్లు మంజూరు చేయవలసిందిగా ఆదేశించారు. దీనిలో భాగంగా పేద మహిళ కుటుంబీకులైన గాదంగి ఉమా, రేణుక, అనూష, మామిడి శ్రీను లకు ఇండ్లు మంజూరు కాగా, వారు సంతోషంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం వెలుగుపెల్లిలో ఎంజిఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనము, రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయం నూతన బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, దాసరి శ్రీను, సుంకరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.