13-06-2025 12:00:00 AM
కాజల్ అగర్వాల్ పాన్ఇండియా కథానాయికగా పేరుగాంచింది. పేరుకు ఉత్తరాది భామే అయినా తెలుగు చిత్రాల ద్వారానే పాపులర్ అయ్యింది. తొలుత గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ఈ అమ్మడు మగధీర, చందమామ వంటి చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. 2020లో వివాహానంతరం ప్రస్తుతం ‘ఇండియన్3’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘కన్నప్ప’లోనూ పార్వతీదేవిగా కనిపించనుంది.
ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాల్లో బిజీగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ మళ్లీ ప్రైమ్ టైమ్లోకి వచ్చేందుకు దర్శకత్వంపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. స్వీయ దర్శకత్వంలో తానే కథానాయకిగా నటించాలని భావిస్తోందట. పక్కా కమర్షియల్ అంశాలున్న కథతో ఈ సినిమాను హిందీలో రూపొందించే ప్రయత్నాల్లో ఉందని టాక్.
అందరు హీరోయిన్లలాగే అవకాశం వచ్చినప్పుడు నటిస్తూ ఉండకుండా.. రిస్క్తో కూడుకున్న దర్శకత్వం జోలికి వెళ్లడమెందుకు? అని తన స్నేహితులు సూచిస్తున్నారట. మరి కాజల్.. వారి మాటకు విలువనిచ్చి, ఆ ఆలోచనను విమరించుకుంటుందా? దర్శకురాలిగా స్క్రీన్పై తన పేరు చూసుకోవాలన్న కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుందా? అన్నది వేచిచూడాల్సిందే!