10-08-2025 12:54:40 AM
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్గా వస్తున్న చిత్రం ‘కాంత’. తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. కింగ్డమ్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిలమ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా నుంచి రాఖీ పండుగ కానుకగా.. శనివారం ‘పసిమనసే’ అనే మెలోడిని విడుదల చేశారు మేకర్స్. ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్కే పాడిన ఈ పాటకు కృష్ఱకాంత్ సాహిత్యం అందించగా.. జాను చంతూర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.