20-06-2025 02:34:58 PM
చందుపట్ల జనార్ధన్.
హుజురాబాద్: (విజయక్రాంతి): కరాటే విద్యతో విద్యార్థిని విద్యార్థులకు మనోధైర్యం కలుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెందుపట్ల జనార్ధన్ అన్నారు. శుక్రవారం కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్, షాటో కాన్ కరాటే డు అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టుల్లో విజయం సాధించిన కరాటే విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ... కరాటేను తన వృత్తిగా ఎంచుకొని ఎస్కే జలిల్ ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. ద్వారా విద్యార్థులకు శారీరక అభివృద్ధి తో పాటు మానసికంగా ఎదుగుదలకు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడంలో కరాటే తోడ్పడుతుందని అన్నారు. ముఖ్యంగా కరాటే ఆడపిల్లలకు ఎంతోగానో తోడ్పాటు అందిస్తుందన్నారు. కరాటేను విద్యార్థిని, విద్యార్థులు ఇష్టంతో నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పిఈటి సొల్లు సారయ్య, ఉప్పు శ్రీనివాస్, ఆకుల సాధనం, రాజకుమార్, కాళీ హుస్సేన్, సమ్మయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.