20-06-2025 04:21:55 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మండల పరిధిలోని తిమ్మాపురం పీఏసీఎస్ లో రైతులకు కావలసిన వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ సీఈఓ వూర సత్యనారాయణ(PACS CEO Voora Satyanarayana) శుక్రవారం చెప్పారు. తమ కార్యాలయం వద్ద బీపీటీ-5204 రకం 25 కిలోల సంచులు, ఎంటీయూ-1010 30 కిలోల సంచులు, ఎంటీయూ-1290 రకం 30 కిలోల సంచులు, అంకూర్-101 10 కిలోల సంచులు, కేఎన్ఎం-118 30 కిలోల సంచులు, జేజీఎల్-24423 రకాల వరి విత్తనాలు ఉన్నాయని, అవసరం ఉన్న రైతులు తీసుకెళ్లాలని సూచించారు.