06-05-2025 12:50:11 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కారల్మార్క్స్ 207వ జయంతి
భద్రాద్రికొత్తగూడెం మే 5 (విజయ క్రాంతి): పెట్టుబడి దారులు సాగిస్తున్న దోపిడికి వ్యతిరేకంగా కార్మికులు, కష్టజీవులను ఏకం చేసే సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి, మానవ శ్రమకు విలువ చేకూర్చిన మహామేధావి కారల్మార్క్స్ అని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మార్క్స్ 207వ జయంతిని పురస్కరించుకొని శేషగిరిభవన్లో సోమవారం మారక్స్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ మానవ శ్రమకు విలువ లేని పరిస్థితుల్లో శ్రమైక జీవులకు పని గంటలు, శ్రమకు తగిన వేతనం కోసం ఆయన చేసిన కృషి ప్రపంచ కార్మిక వర్గానికి తోడ్పాటును అందించిందన్నారు. మార్క్సిజం ప్రపంచ మానవాలికి దిక్సూచి వంటిదని, అన్యాయం, దోపిడి, అవినీతి నిర్మూటించబడా- లంటే మార్క్సిజానికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని సూచించారు.
కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరిమి రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి పాల్గొన్నారు.