11-04-2025 06:53:56 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని సూపర్ బజార్ ఏరియా సాయి బాబా దేవాలయ ప్రాంగణంలో దేవత సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శుక్రవారం భక్తులు అత్యంత భక్తి,శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గర్తన్యాసం, బీజన్యాసం, రత్నన్యాసం మొదలై యంత్రల ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, కళాన్యాసములు, దృష్టికుంభము, మహా పూర్ణాహుతి, బలిహరణము మొదలైన పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ, అన్నదాన ప్రసాదల వితరణ నిర్వహించారు.