18-02-2026 01:16:57 AM
నిర్మల్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి రాష్ట్ర అభివృద్ధికి దోహద పడింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ ఉద్యమ నేతగా ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు అనంతరం ఆసుపత్రిలో పండ్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డిమార్కొండ రాము శ్రీకాంత్ యాదవ్ భూషణ్ రెడ్డి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.