calender_icon.png 15 June, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్త దాతలకు సన్మానం

14-06-2025 12:25:09 PM

రెడ్ క్రాస్ బిచ్కుంద ఆధ్వర్యంలో రక్త దాతలకు సన్మానం

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శనివారం అత్యధిక సార్లు రక్త దానం చేసిన రక్త దాతలను సత్కారం చేసి రోగులను పండ్లు పంపిణీ చేశారు. రక్త దానం యొక్క ప్రాముఖ్యత ను వివరించి అత్యధిక సార్లు రక్త దానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన  సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రచ్చ శివకాంత్, ముత్యాల సందీప్, యువతకు ఆదర్శం పిండ్కులవార్ శివకుమార్, బాలరాజ్ లను రక్త దాతగా ఉంటూ తన తండ్రి మరణాంతరం తండ్రి గంగారం పార్థివ దేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేసిన చిల్లెల సాయిలు, వైద్య సిబ్బంది విజయలను ఘనంగా సత్కరించారు.