calender_icon.png 15 June, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి

15-06-2025 09:01:02 AM

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌లో ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న(Kedarnath Helicopter Crash) హెలికాప్టర్ అడవిలో కూలిపోవడంతో ఏడుగురు మరణించారు. ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గుప్త్ కాశి నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు యాత్రికులతో వెళుతోంది. 10 నిమిషాల ప్రయాణంలో, గౌరికుండ్ -సోన్‌ప్రయాగ్(Gaurikund- Sonprayagఅటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADF) లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ ప్రకారం, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ (5 మంది పెద్దలు, 1 పిల్లవాడు) సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

మృతులను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. సాంకేతిక సమస్య, వాతావరణం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పశువులకు మేత సేకరించడానికి వెళ్లిన స్థానికులు హెలికాప్టర్ పడిపోతున్న విషయాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. ఎన్డీఆర్ఎఫ్(National Disaster Response Force) ఎస్డీఆర్ఎఫ్(State Disaster Response Force) బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మే 2న హిమాలయ దేవాలయం కేదార్‌నాథ్ ద్వారాలు తెరిచినప్పటి నుండి ఇది ఐదవ ప్రమాదమని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు.