15-06-2025 01:52:03 AM
-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన పోరు
- ఇజ్రాయెల్ దాడుల్లో మరో ఇద్దరు కీలక జనరల్స్ హతం
-ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా క్షిపణి దాడులు
-‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’తో ఇరాన్ ప్రతీకార చర్య
-టెల్ అవీవ్పై క్షిపణుల వర్షం
-ఇరాన్లో 86 మంది.. ఇజ్రాయెల్లో ముగ్గురు మృత్యువాత
టెల్ అవీవ్/టెహ్రాన్, జూన్ 14: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తో పశ్చిమాసియా అతలాకుతలమవుతోం ది. ఇరుదేశాల మధ్య సంఘర్షణ మరింత ముదిరింది. మూడో రోజైన శనివారం తెల్లవారుజామున అటు ఇరాన్.. ఇటు ఇజ్రా యెల్ లెక్కకు మిక్కిలి క్షిపణులతో ఒకరిపై ఒకరు భీకరమైన దాడులు చేసుకున్నారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 86 మంది మృతి చెందగా.. 341 మంది గాయపడ్డారు. మరోవైపు ఇరా న్ ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్లో ముగ్గురు పౌరులు మరణించగా.. డజన్ల సం ఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది.
ఇరాన్ అణు స్థావరాలు, సైనిక కేంద్రాలే ప్రధాన లక్ష్యంగా ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరు తో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడుల్లో తాజాగా మరో ఇద్దరు టాప్ జనర్సల్ ప్రా ణాలు కోల్పోయారు. ఇరాన్ సైనిక ఇంటెలిజెన్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ అయిన జనరల్ గోలంరెజా మెహ్రాబీ, ఆపరేషన్స్ విభాగ డిప్యూటీ హెడ్ అయిన జనరల్ మె హ్దీ రబ్బానీ మృతి చెందారు. అయితే ఇరాన్ సైతం ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది. టెల్ అవీవ్, జెరూసలేం నగరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది.
ఆయా ప్రాం తాల్లో పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడు లు నిర్వహించింది. పలుచోట్ల బాంబు పేలు ళ్లు కూడా చోటుచేసు కున్నాయి. ఇజ్రాయెల్కు పటిష్టమైన ఐరన్డోమ్ వ్యవస్థను కూ డా ఛేదించుకొని ఇరాన్ దాడి చేయడం వా రి సైనిక సామర్థ్యాన్ని వెల్లడించింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ 24 గంటలు గడవకముందే ఇరాన్లోని టెహ్రాన్ నగరంపై మూడోసారి బాంబుల వర్షం కురిపిం చింది.
ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఇద కేవ లం ఆరంభం మాత్రమేనన్నారు. ఇరాన్ అ ణు శక్తిని నిర్మూలించే వరకు తాము ఆగబోమని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యా హు వ్యాఖ్యలతో పశ్చిమా ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశ ముంది. ఇలా గే దాడులు కొనసాగిస్తే టెహ్రా న్ నగరం కా లిపోవడం ఖామమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇరాన్కు హెచ్చ రికలు జారీ చేశారు.
ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హతం
ఇజ్రాయెల్ రహస్య బలగాలు యుద్ధం లో తాజాగా తమ పట్టును చూపించాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ టెహ్రాన్పై నిర్వహించిన వైమానిక దాడిలో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు. మృతి చెందిన తొమ్మిది మంది ఇరాన్ అణు బాంబు అభివృద్ధిలో కీలక పాత్రదారులు. దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులు. ఇది ఇరాన్ అణుకాంక్షకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లక్ష్యంగా ఆయన నివాసముంటున్న సమీపంలోనే వైమానిక దాడులు జరిపింది.
టెహ్రాన్లోని మెనిరియాలో ఈ వైమానిక దాడులు కొనసాగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. అణుశక్తి కేంద్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకున్న ఇజ్రాయెల్ ఫోర్డో సైట్లోని అణుశక్తి కేం ద్రంపై దాడులకు దిగడంతో ఇరాన్కు భారీ నష్టమే జరుగతున్నట్టు ఆ దేశ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు 86 మందికి పైగా ఇరాన్ పౌరులు సహా 329 మంది గాయపడినట్టు స్థానిక ప్రభుత్వ మీడియా తెలిపింది.
టెహ్రాన్ కాలిపోవడం ఖాయం
కాగా టెల్ అవీవ్పై దాడుల తర్వాత ఇ జ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తీవ్రంగా మం డిపడ్డారు. ఇరాన్ ఇలానే దాడులు చేస్తూ పో తే మాత్రం టెహ్రాన్ కాలిపోవడం ఖాయమ ని హెచ్చరించారు. పౌర నివాసాలపై దా డు లు చేసి వారికి హాని తలపెట్టాలని చూస్తే తీ వ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ దాడికి ప్రతిచర్యగా మరోసారి ఇజ్రాయెల్ టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అణు, మిలటరీ స్థావరాలతో సహా 200 లక్ష్యాలపై దా డులు నిర్వహించింది. ఇస్ఫహాన్ అణుకేంద్ర ంపై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్ల డి ంచింది. ఎయిర్ఫోర్స్ ఫైటర్ జెట్లతో లక్ష్యాలను ఛేదించినట్టు తెలిపింది. ఇజ్రాయె ల్ జ రిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన ము గ్గురు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మృతి చెందినట్టు టెహ్రాన్ మీడియా ధృవీకరించింది.
ఐరన్ డోమ్ను ఛేదించిన ఇరాన్ క్షిపణులు
ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు ప్రతీకారంగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో ఇరాన్ భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఏకకాలంలో వందకు పైగా క్షిపణులతో దాడులు చేయగా.. ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అయితే ఇజ్రాయెల్కు అత్యంత పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ శనివారం ఇరాన్ వదిలిన వందలాది బాలిస్టిక్ క్షిపణుల్లో చాలావరకు ఐరన్ డోమ్ను చీల్చుకుంటూ దూసుకెళ్లడం గమనార్హం.
ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. 34 మందికి పైగా గాయపడినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇజ్రాయెల్లోని డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేపట్టినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్టు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో చీఫ్ మహ్మద్ బాఘేరి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక 2013 నుంచి 2023 వరకు దేశ రక్షణ మంత్రిగా అమీర్ హతామీ బాధ్యతలు నిర్వహించారు. కాగా ఇజ్రాయెల్ తమపై చేస్తున్న దాడులకు అంతకంతకూ బదులు తీర్చుకుంటామని సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీ పరోక్షంగా హెచ్చరించారు.
అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు ఇరాన్ హెచ్చరికలు
తాము ఇజ్రాయెల్పై చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు సహకరిస్తే ఆయా దేశాల స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న టెల్అవీవ్కు వాషింగ్టన్ మద్దతునిస్తుందని ఇప్పటికే ఇరాన్ అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే.