calender_icon.png 19 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు, భవనాల అభివృద్ధి పనులపై మంత్రితో కీలక చర్చలు

19-01-2026 12:01:51 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 18 (విజయక్రాంతి): మేడారం జాతరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నిమిత్తం హనుమకొండకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం హనుమకొండ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు, భవనాలు, పలు అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం గుర్తింపు పొందిందని, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వరరావు, కార్పొరేటర్లు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, హనుమకొండ అంబేద్కర్ రాజు, హనుమకొండ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎం.డి నేహాల్, వడ్డేపల్లి మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.