మహిళ కడుపులో 2 కిలోల వెంట్రుకలు
ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
బరేలీ (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 6: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందని ఓ మహిళ(25) అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె గత 15 ఏళ్లనుం చి తలవెంట్రుకలు తింటూ వస్తోంది. తాజాగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి ప్రారంభం అయ్యింది. ఏం తిన్నా వాంతుల రూపంలో బయటకు వచ్చేసేది. ఆమె సెప్టెంబర్ 22న బరేలీలోని మహారాణా ప్రతాప్ జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది.
ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. బాధిత మహిళ ట్రైకోలోటోమేనియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి సోకినవారికి జుట్టు తినాలని బలమైన కోరిక ఉం టుందట. ఈ కారణాంగానే తల వెం ట్రుకలు తినడం ఆమెకు అలవాటుగా మారిపోయందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆమె కడుపులో 2 కేజీల వర కు వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆసుప త్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారని సమాచారం.






