27 April, 2026 | 10:46 PM

మధుసూదన్ మృతి పట్ల ఖమ్మం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నివాళి

27-04-2026 09:14 PM

ఖమ్మం,(విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ , ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టీ విక్రమార్క పిఆర్ఓ గుండె పోటుతో అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన  మృతి పట్ల ఖమ్మం జిల్లా TWJF కమిటీ  తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈనాడు , ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జి గా మధుసూదన్ పని చేసారు. ఖమ్మంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో ఇంచార్జి గా పదేళ్ల పాటు  పని చేసారు.  మధు మృతి పట్ల TWJF జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం ప్రకటించింది. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి,  న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.