12 July, 2026 | 6:23 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

20-03-2025 08:34 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి స్టోర్ రూమ్, రోగుల వార్డులను పరిశీలించి, రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యంపై నమ్మకం ఉంచాలని, ప్రభుత్వం ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సదుపాయాలు, వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.

ఈ మేరకు ఆయన ఆసుపత్రి సూపర్డెంట్ వంశీతో మాట్లాడుతూ... ఆసుపత్రిలో ఎటువంటి సదుపాయాలు కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రోగులకు ఎటువంటి కొరత ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పిఎసిఎస్ సత్యనారాయణ, జహీర్, మీర్జా, తాసిల్దార్ సుజాత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సూపర్డెంట్ వంశీ మాధవ్ తదితరులు ఉన్నారు.