12 March, 2026 | 10:17 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నిండు కుండను తలపిస్తున్న కిన్నెరసాని

14-07-2024 06:07 AM

400 అడుగులకు చేరిన నీటి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో కొత్త నీరు చేరుతోంది. కిన్నెరసాని జలాశయం నీటి మట్టం శనివారం ఉదయం వరకు 400.60 అడుగులకు చేరుకొంది. ప్రస్తుతం 750 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకొంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నీటి మట్టం 15 అడుగులకు చేరుకొంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నీటి మట్టం 15 అడుగులు చేరుకొంది.