24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం జిల్లా ఆగం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

17-06-2026 01:24 PM

ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పాలేరు: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పర్యటించారు. సర్ ప్రక్రియపై పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బీఎల్ వోలకు అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని కేటీఆర్ తెలిపారు. రైతులకు రైతుబంధు లేదు, యూరియా లేదు, కరెంట్ లేదన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం(Telangana State Revenue), ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ  తగ్గుతోంది.. రెవెన్యూ మంత్రి అవినీతి పెరుగుతుందని తెలిపారు.

కష్టపడి పంటలు పండించినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తుంటే వ్యవసాయ మంత్రి అక్రమాలు మాత్రం రోజుకొకటి బయటకొస్తున్నాయని వెల్లడించారు. ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం ఆగమవుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే ఆర్థిక మంత్రి కమీషన్ల దందా మాత్రం జోరుగా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందన్న కేటీఆర్ బాంబుల మంత్రి అక్రమ సంపాదన భారీగా పెరిగిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమాలపై కేటీఆర్ వీడియో ప్రదర్శన చేశారు. బాండ్ పేపర్లు, గ్యారెంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు.