calender_icon.png 18 January, 2026 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సౌకర్యార్థం 144 సెక్షన్ సడలింపు

08-09-2024 03:09:10 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు విధించిన 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ప్రజల సౌకర్యార్థం సడలింపు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కొరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, వాంకిడి, తిర్యాణి మండలాలు మినహా  జిల్లాలోఅందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.