calender_icon.png 27 July, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలి

27-07-2025 06:28:01 PM

కేసీఆర్ కుట్ర ఫలితమే ఆరు జిల్లాల ఏర్పాటు..

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన కుట్రల ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించడం జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి(Senior Journalist Pasham Yadagiri) విమర్శించారు. ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో చర్చావేదిక కార్యక్రమానికి కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహించారు. పాశం యాదగిరి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, కేసిఆర్ కుట్రల ఫలితంగా రాజకీయ లబ్ధి కోసం ఆరు జిల్లాలుగా ఏర్పాటు జరిగిందని, చారిత్రక వరంగల్, హనుమకొండ నగరాలను వేరుగా విభజించడం వలన ఆర్థికంగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా సంఘాలన్నీ రెండు జిల్లాలను ఒకటిగా చేసేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా మరోసారి ఉద్యమాలు నిర్వహించుటకు ప్రజాసంఘాలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా భాజపా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చుక్కయ్య, సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆబుబాకర్, న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు నూనె అప్పారావు లు ముక్తకంఠంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు జిల్లాల ఒకటిగా అయినప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కోరారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ సీనియర్ అధ్యాపకులు, చరిత్రకారుడు ప్రొఫెసర్ విజయబాబు, తెలంగాణ ఉద్యమ నాయకులు చిల్ల రాజేంద్రప్రసాద్, అడ్వకేట్ ప్రముఖ రచయిత, తెలంగాణ మేధావి పొట్లపల్లి శ్రీనివాసరావు, కాకతీయ విశ్వవిద్యాల అధ్యాపకులు డాక్టర్ చింత ప్రవీణ్, ప్రముఖ విద్యావేత్త గంటా రామ్రెడ్డి, పుల్లూరు సుధాకర్, చాపర్తి కుమార్, హనుమకొండ రెడ్ క్రాస్ కోశాధికారి బొమ్మిలేని పాపిరెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు బాబురావు, సామాజికవేత్త సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, రైతు సంఘం నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్, అనేకమంది ఉద్యమకారులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.